Search This Blog

Friday, March 16, 2012

కేంద్ర బఢ్జెట్ 2012-13


పెట్టుబడుల ఉపసంహరణ 30 వేల కోట్లు
ప్రయివేటు పెట్టుబడులకు ఎర్ర తివాచీ
ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ సారాంశం ఇదే

* 2011-12లో వృద్ధిరేటు 6.9 శాతం
* ప్రభుత్వ రంగ సంస్థల్లో 51 శాతం వాటా కొనసాగింపు
* ఆదాయ పన్ను మినహాయింపు బడ్జెట్ నుంచి రూ. 3 లక్షలకు పెరుగుతుందని భావించినా నిరాశే   ఎదురైయింది.
* 25 లక్షలలోపు గృహ రుణాలకు ఒక శాతం వడ్డీ రాయితీ
* ఇప్పటికే సర్వీసు ట్యాక్సు మోత మోగుతుంటే దానిని ఇంకా పెంచడానికి ఇందులో ప్రతిపాదనలు తెచ్చారు.
* ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీలో భారీ కోత పెట్టారు. 4.7 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు చుక్కలు చూపించారు. 2010-11లో అమలులో ఉన్న 9.5 శాతం వడ్డీ రేటును... 2011-12 సంవత్సరానికి 8.25కు తగ్గించారు. ఈపీఎఫ్ వడ్డీలో ఏకంగా 1.25 శాతం కోత పెట్టడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి.